ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న

ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఆదివారం తన తాజా జాబితాలో ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఏపీతో పాటు జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. ఏపీలో 9, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఏపీకి సంబంధించి తొలి జాబితాలో 6, రెండో జాబితాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను గతంలో ప్రకటించారు. తాజాగా ప్రకటించిన స్థానాలివే..

అనంతపురం - మల్లికార్జున్ వజ్జల
హిందూపురం-సమాద్ షాహీన్
శ్రీకాకుళం-పరమేశ్వరరావు
విజయనగరం -బొబ్బిలి శ్రీను
అమలాపురం-జంగా గౌతం
మచిలీపట్నం -గోళ్లు కృష్ణ
విజయవాడ -వల్లూరు భార్గవ్
ఒంగోలు-ఈడ సుధాకర్ రెడ్డి
నంద్యాల-లక్ష్మీ నరసింహ యాదవ్

Updated On 22 April 2024 12:47 AM GMT
Yagnik

Yagnik

Next Story