ఎస్సీ వర్గీకరణపై జైబీంపార్టీ (JaiBheem party)అధ్యక్షులు జడ శ్రవణ్‌ (Jada Sravan)సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎస్సీ వర్గీకరణపై జైబీంపార్టీ (JaiBheem party)అధ్యక్షులు జడ శ్రవణ్‌ (Jada Sravan)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పువెలువడిన రోజు దేశంలో బ్లాక్‌ డేగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో రిజర్వేషన్‌ ఎత్తివేసే కుట్రకు బీజేపీ(BJP) తెరలేపిందని విమర్శించారు. అసలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆద్యుడే చంద్రబాబు(Chandrababu)అని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌(Pawan) కలిసి మాల, మాదిగలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మాలలను దోషులుగా చంద్రబాబు చూపించారని దళిత బిడ్డలు విడిపోవడానికి మూల కారణం చంద్రబాబే అని జడ శ్రవణ్ విమర్శించారు. ఒక రాష్ట్ర సమస్యను దేశం మొత్తానికి ఎలా ఆపాదిస్తారని అన్నారు. ఏబీసీడీ(ABCD)వర్గీకరణతో పాటు క్రిమిలేయర్‌ వర్తింపజేయాలని బీజేపీ కుట్రపన్నుతోందని ఆయన విమర్శించారు. క్రిమిలేయర్‌ అమలు చేస్తే రిజర్వేషన్‌తో ఐఎఎస్‌(IAS)అయిన వ్యక్తి కుమారుడికి రిజర్వేషన్‌ అవసరమా? ఆర్ధికంగా ఎదిగిన తర్వాత కూడా రిజర్వేషన్లు ఎందుకు? వాటిని తీసేయాలని క్రిమిలేయర్‌ చెబుతున్నది. ఆర్టికల్‌ 341, ఆర్టికల్‌ 342 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది వారి ఆర్ధిక స్థోమతలను దృష్టిలో పెట్టుకుని కాదు! వారి పట్ల వివక్ష చూపుతున్నందుని ఆయన అన్నారు. సమాజం వారిని దూరంగా పెట్టినందుకు. వారి పట్ల చిన్నచూపు చూస్తున్నందుకు. సమాజం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండటం.. అస్పృశ్యులుగా చూస్తుండటం. ఈ కారణాల వల్లే వారికి రిజర్వేషన్లు కల్పించింది భారత రాజ్యాంగం. ఉన్నత హోదాలో ఉన్నవారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు.

రిజర్వేషన్ల వెనుక ఇంత గొప్ప ఆశయాలు ఉన్నాయని, వర్గీకరణ పేరుతో క్రిమిలేయర్‌ అమలు చేస్తే అటు మాలలు, ఇటు మాదిగలు పూర్తిగా నష్టపోతారని జడ శ్రవణ్‌ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి మాలలు గట్టి బుద్ధిచెప్పాలన్నారు. దళిత బిడ్డలను విడదీసిన పాపం ఊరికే పోదని చంద్రబాబును ఉద్దేశించి జడ శ్రవణ్‌ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై లీగల్‌గా, పీపుల్స్‌ మూమెంట్‌గా(Peoples Movement),పొలిటికల్‌(Political)గా కొట్లాడుతామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును, ఆయన పార్టీ టీడీపీ(TDP)ని భూస్థాపితం చేస్తామని జడ శ్రవణ్‌ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు.

ehatv

ehatv

Next Story