AP High Court PIL : టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సభ్యుల(TTD Board Members) నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్(High Court PIL) దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్(Liquor) వ్యాపారాలు చేస్తున్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు(Chinta Venkateswarlu) ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్(Petetion) వేశారు.

AP High Court PIL
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సభ్యుల(TTD Board Members) నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్(High Court PIL) దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్(Liquor) వ్యాపారాలు చేస్తున్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు(Chinta Venkateswarlu) ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్(Petetion) వేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Samineni Udhayabhanu), కేతన్ దేశాయ్(Kethan Desai), శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy) నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిని తితిదే బోర్డు సభ్యులుగా తొలగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
