జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం(Pithapuram Assembly constituency) నుంచి పోటీ చేస్తున్నారు కదా! ఆయన గెలుపు కోసం ఇప్పటికే కొందరు సినిమావాళ్లు వచ్చి ప్రచారం చేస్తున్నారు.

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం(Pithapuram Assembly constituency) నుంచి పోటీ చేస్తున్నారు కదా! ఆయన గెలుపు కోసం ఇప్పటికే కొందరు సినిమావాళ్లు వచ్చి ప్రచారం చేస్తున్నారు. హైపర్‌ ఆది(Hyper Aadi)లాంటి జబర్దస్త్‌ కళాకారులు, టీవీ నటీనటులు కూడా పవన్‌ను గెలిపించాలంటూ పిఠాపురంలో తిరుగుతున్నారు. మరోవైపు పవన్‌కు పోటీగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి వంగా గీత(Vanga Geeta) బరిలో ఉన్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది వదిలేస్తే లేటెస్ట్‌గా పవన్‌పై నటి శ్యామల(Actress Syamala) ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. ఇప్పటికే వంగా గీత గెలుపు ఖాయమయ్యిందని ఆమె చెప్పారు. అంత ఇమేజ్‌ ఉన్న సినిమా స్టారే అయితే పవన్‌ మిగతా సినిమావారిని తీసుకొచ్చి ఎందుకు ప్రచారం చేయిస్తున్నారని ప్రశ్నించారు. వంగా గీత చాలా సీనియర్‌ నాయకురాలని, ఆమెను ఓడించడం ఎవరి తరం కాదని శ్యామల అన్నారు. వంగా గీత ఎక్కడ్నుంచి ఎక్కడి వరకు ఎదిగారో అందరికీ తెలుసన్నారు. ఆమెకు భారీ మెజారిటీ రావాలని తాను ప్రచారం చేస్తున్నానని శ్యామల అన్నారు. అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండని, ఆ అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వంగా గీత వల్లే సాధ్యమని పిఠాపురం ప్రజలకు శ్యామల విన్నవించుకున్నారు.

Updated On 3 May 2024 4:36 AM GMT
Ehatv

Ehatv

Next Story