అనంతపురం జిల్లా(Anantapur District) బ్రహ్మసముద్రం(Brahmasamudram) మండలం ముప్పులకుంట(Muppulakunta) గ్రామంలో జాహ్నవి అనే 3 ఏడేళ్ల చిన్నారికి 3 నెలల క్రితం పిచ్చి కుక్క కరిసిన ఘటన

అనంతపురం జిల్లా(Anantapur District) బ్రహ్మసముద్రం(Brahmasamudram) మండలం ముప్పులకుంట(Muppulakunta) గ్రామంలో జాహ్నవి అనే 3 ఏడేళ్ల చిన్నారికి 3 నెలల క్రితం పిచ్చి కుక్క కరిసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 3 నెలల క్రితం గ్రామంలో ఆలయనిర్మాణ పునాది పై జాహ్నవి ఆడుతూ కిందపడటంతో గాయల కారణంగా ఓ ప్రవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో, తల్లిదండ్రులు చిన్నారిని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించిన ఫలితం లేకపోయింది. శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పిచ్చి కుక్కకాటు తోనే చిన్నారి మృతిచెందిందని, 3 నెలల తరువాత ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. వచ్చే నెల మే 31న చిన్నారి జాహ్నవి జన్మదినం అని తలిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అదే విదంగా గ్రామంలో వరుసగా పిల్లలు, పెద్దలు, పశువులపై పిచ్చి కుక్క దాడిచేసిందని, అధికారురులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన ఈ విషయంపై పట్టించుకోలేదని గ్రామస్థులు తెలిపారు. ఇకనైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Updated On 8 April 2023 2:16 AM GMT
Ehatv

Ehatv

Next Story