ఇష్టం లేని పెళ్లి(Marriage) చేశారంటూ ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.

ఇష్టం లేని పెళ్లి(Marriage) చేశారంటూ ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అన్న భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య(Murder) చేసి తాను ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. బుధవారం రాత్రి తిరుపతి పద్మావతినగర్‌లో ఈ ఘాతుకం జరిగింది.

నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరిపిదాస్‌ రెండేళ్ల కిందట కుటుంబంతో పాటు తిరుపతి వచ్చి పద్మావతి నగర్‌లో ఉంటున్నాడు. ప్రైవేటు కంపెనీలో(Private company) పని చేస్తున్న తిరిపిదాస్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తిరిపిదాస్‌కు ఓ తమ్ముడు ఉన్నాడు. అతడి పేరు గుడిమెట్ల మోహన్‌. 36 ఏళ్ల మోహన్‌కు 2019లో అన్నా వదినలు పెళ్లి చేశారు. అయితే కాపురంలో గొడవల కారణంగా 2021లో మోహన్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. తిరిపిదాస్‌ తమ్ముడి భార్య, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వివాదం సమసిపోయేలా చేశాడు. ఆ సమయంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేశావంటూ అన్నపై మోహన్ దాడి చేశారు. కొన్నాళ్ల తర్వాత మోహన్‌ దంపతుల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. మోహన్‌ భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న మోహన్ తరచూ తిరుపతిలోని అన్న ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. రెండు రోజుల కిందట వచ్చిన మోహన్ సాయంత్రం అన్న కూతుళ్లను స్కూల్‌ నుంచి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి బజార్‌కు వెళ్లాడు. ఏమైందో ఏమో కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కత్తితో వదిన, అన్న కూతుళ్ల గొంతు కోశాడు. తర్వాత తను ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాస్‌ ఇంటికి వచ్చి చూస్తే తలుపులు లోపల గడియ పెట్టి ఉంది. దాస్‌కు అనుమానం వచ్చి వెనుక తలుపు నుంచి ఇంట్లోకి వచ్చాడు. అప్పటికే భార్య, ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. తమ్ముడు మోహన్‌ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో కొన్ని కీలక ఆధారాలను క్లూస్ టీమ్‌ సేకరించింది. ఇష్టంలేని పెళ్లి చేసినందుకు తమ్మడు తనపై కక్ష పెంచుకున్నాడని, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని దాస్‌ పోలీసులకు తెలిపాడు.

Eha Tv

Eha Tv

Next Story