మధ్య వయస్కులు, పట్టుమని పాతికేళ్లు కూడా లేనివారు, చివరికి పిల్లల గుండెలు కూడా హఠాత్తుగా ఆగిపోతున్నాయి. ఇటీవల ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. పిడుగురాళ్ల(Piduguralla) పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌(Sc Boys Hostel)కు చెందిన ఓ విద్యార్థి గుండెపోటు(Heart Attack)తో చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ(Guttikonda )గ్రామానికి చెందిన మందా కోటేశ్వరరావు కుమారుడు కోటి స్వాములు

మధ్య వయస్కులు, పట్టుమని పాతికేళ్లు కూడా లేనివారు, చివరికి పిల్లల గుండెలు కూడా హఠాత్తుగా ఆగిపోతున్నాయి. ఇటీవల ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. పిడుగురాళ్ల(Piduguralla) పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌(Sc Boys Hostel)కు చెందిన ఓ విద్యార్థి గుండెపోటు(Heart Attack)తో చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ(Guttikonda )గ్రామానికి చెందిన మందా కోటేశ్వరరావు కుమారుడు కోటి స్వాములు పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఉంటూ ఇక్కడే జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి భోజనం తర్వాత స్టడీ అవర్‌లో కొంచెం ఇబ్బంది పడ్డారు కోటిస్వాములు. తనకు ఊపిరి ఆడటం లేదని ఫ్రెండ్స్‌కు చెప్పాడు. గాలి ఆడే చోట కూర్చోమని చెప్పారు స్నేహితులు. గదిలోని ఫ్యాన్‌ కింద కూర్చోవడానికి వెళుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. కోటిస్వాములను లేపేందుకు స్నేహితులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వాచ్‌మన్‌కు కబురు చేశారు. వాచ్‌మన్‌ వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించాడు. కోటిస్వాములను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కోటిస్వాములు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. హాస్పిటల్‌ దగ్గర బాలుడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

Updated On 17 April 2023 12:30 AM GMT
Ehatv

Ehatv

Next Story