తిరుపతి (Tirupathi) జిల్లా గూడూరు  (Guduru) దగ్గర ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లెక్క చూపని 55.87 లక్షలను (55.87 Lakhs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని నిందితులను ప్రశ్నిస్తున్నారు.

తిరుపతి (Tirupathi) జిల్లా గూడూరు (Guduru) దగ్గర ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లెక్క చూపని 55.87 లక్షలను (55.87 Lakhs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని నిందితులను ప్రశ్నిస్తున్నారు. గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్ (Hyderabad) నుంచి చెన్నై (Chennai) వైపు వెళ్లే ప్రైవేట్‌ బస్సులో తనిఖీలు చేయగా నగదు దొరికిందని డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి (DSP Suryanarayna Reddy) వెల్లడించారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో బస్సులో తనిఖీ చేయగా బస్సు బెడ్ షీట్ల కింద ఉంచిన నగదును గుర్తించామని అన్నారు.. పట్టుబడిన నగదుకు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశామని వెల్లడించారు.. బంగారం (Gold) కొనుగోలుకు కోసం చెన్నైకి నగదును తీసుకు వెళ్తున్నట్లు సంబంధిత వ్యక్తులు వెల్లడించినట్లు డీఎస్పి సూర్యానారాయణరెడ్డి తెలిపారు

Updated On 24 Dec 2023 3:27 AM GMT
Ehatv

Ehatv

Next Story