సభ్య సమాజంలో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు..

సభ్య సమాజంలో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు.. మన అనుకున్న వాళ్లే తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అటువంటి ఘటనే తాజాగా నంద్యాల(Nandhyala) జిల్లా నాగటూరు గ్రామంలో చోటుచేసుకుంది. తండ్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి, ఏకంగా తన కోడలి(niece) పైనే కన్నేశాడు. తన కామ కోరికలు తీర్చలేదని కోడల్ని దారుణంగా హత్య(Murder) చేశాడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా నాగటూరు గ్రామానికి చెందిన 51 సంవత్సరాల వయస్సు ఉన్న కురుమన్న అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన కోడలిపై(Niece) కన్నేసిన మామ తగిన సమయం కోసం ఆగాడు. కోడలి కోసం ఎప్పుడూ ఆశగా ఎదురు చూసేవాడు. కోడలితో ఆ కోరిక తీర్చుకోవాలని రగిలిపోయేవాడు. ఈ విషయాన్ని గ్రహించని కోడలు అతడిని తండ్రి సమానంగా భావించి గౌరవించేది. అదును కోసం ఎదురు చూస్తున్న మామకి ఓ అవకాశం వచ్చింది. ఈ క్రమంలో పొలంలో కంకులను ఏరి వేసేందుకు వచ్చిన కోడలు ఒంటరిగా ఉండడాన్ని మామ గమనించాడు. తన కోరిక తీర్చుకోడానికి ఇదే తగిన సమయం అనుకున్నాడు. ఒంటరిగా ఉన్న కోడలిపై ఒక్కసారిగా అత్యాచారయత్నానికి(Rape) ప్రయత్నించాడు. ఆమె భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో. మామ బారి నుండి రక్షించుకునేందుకు ప్రయత్నించింది. మామను గట్టిగా ప్రతిఘతించింది. దీంతో సహనం కోల్పోయిన మామ కురుమన్న అతికిరాతకంగా బండరాయితో కోడలి ముఖంపై బాదాడు. తీవ్ర రక్తస్రావంతో కోడలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కోడల్ని కూతురిలా భావించాల్సిన మామ.. కోడలి పైనే కన్నేసి అత్యాచారయత్నానికి పాల్పడడం, నిరాకరించిన ఆమెను హత్య చేయడంతో నిందితుడిపై దాడికి స్థానికులు యత్నించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. హతురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులు అమ్మ అమ్మా అంటూ రోదించడం స్థానికులను కలచివేసింది.

Eha Tv

Eha Tv

Next Story