సింహాచలం (simhachalam)శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వార్షికోత్సవం చందనోత్సవానికి శనివారం అర్ధరాత్రి నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు . ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో సహా ఆ రోజు దాదాపు మూడు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా.దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి భక్తుల రద్దీ, ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.చందనోత్సవం రోజున భక్తులు స్వామివారి (నిజరూప దర్శనంలో ) చూడచ్చు.

సింహాచలం (simhachalam)శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వార్షికోత్సవం చందనోత్సవానికి శనివారం అర్ధరాత్రి నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు . ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో సహా ఆ రోజు దాదాపు మూడు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా.దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి భక్తుల రద్దీ, ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.చందనోత్సవం రోజున భక్తులు స్వామివారి (నిజరూప దర్శనంలో ) చూడచ్చు.

మొదటి దర్శనం తరువాత ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుండి చందనోత్సవం క్రతువులు ప్రారంభమవుతాయి. అంతకు ముందు వంశపారంపర్య ధర్మకర్త, ఆలయ చైర్మన్ పి.అశోక్ గజపతి రాజు పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం భక్తులకు దర్శనంకు అనుమతిస్తారు.

గురువారం ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున మాట్లాడుతూ భక్తుల సౌకర్యం మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరుగుదొడ్లు, తాగునీటి కియోస్క్‌లు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులు ఆలయానికి వచ్చే రోజున అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.పండుగ దృష్ట్యా సింహాచలం పట్టణంలోని మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు శనివారం నుంచి రెండు రోజుల పాటు మూతపడనున్నాయి.స్వామివారి దర్శనానికి భక్తుల సౌకర్యార్థంస్పెషల్ దర్శనం కోసం టిక్కెట్ల ధర 300, 1,000 ,1,500 రూ.లుగా అందిస్తుంది .

Updated On 22 April 2023 1:46 AM GMT
rj sanju

rj sanju

Next Story