ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను(Pawan Kalyan) జైభీమ్‌ పార్టీ అధినేత జడ శ్రవణ్‌(Jada Shravan) ఘాటుగా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను(Pawan Kalyan) జైభీమ్‌ పార్టీ అధినేత జడ శ్రవణ్‌(Jada Shravan) ఘాటుగా విమర్శించారు. పవన్‌ ఏ రకమైన కామెంట్ చేసినా దాన్ని వ్యక్తిగతమైన వ్యాఖ్యగా భావించకూడదని, డిప్యూటీ సీఎం హోదాలో చేసినట్టుగానే అనుకోవాలని జడ శ్రవణ్‌ అన్నారు. కల్తీ నెయ్యితో తయారైన సుమారు లక్ష శ్రీవారి లడ్డూలను అయోధ్యకు పంపించారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్య అసంబద్ధమైనదిగా జడ శ్రవణ్‌ పేర్కొన్నారు. ఇంత ఆపరిపక్వతమైన స్టేట్‌మెంట్‌ను, తెలివిలేని ప్టేట్‌మెంట్‌ను, అనాలోచితమైన స్టేట్‌మెంట్‌ను, ఆనాలోచితమైన స్టేట్‌మెంట్, ప్రజల మనోభావాలను ఇంకా గాయపరిచే స్టేట్‌మెంట్‌ని సిట్‌ పరిగణననలోకి తీసుకుంటుందని తాను అనుకోవడం లేదన్నారు.


Updated On 6 Oct 2024 9:57 AM GMT
Eha Tv

Eha Tv

Next Story