Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు.

By :  Eha Tv
Update: 2024-06-22 04:41 GMT

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ నేతృత్వంలోని ఎస్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఢీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్‌, వీజేఎస్‌, వైజేఎస్ విద్యార్ధి సంఘాలకు చెందిన నేత‌లు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఇంటిని ముట్ట‌డించిన వారిలో ఉన్నారు.

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై NTAను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నేతలు కిష‌న్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా.. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నేతలు ఇంటిని ముట్టడించారు. విద్యార్ధి సంఘాల నేత‌ల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Tags:    

Similar News