హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో(Gachibowli) ఉన్న రెడ్‌స్టోన్‌ హోటల్‌లో(redstone hotel) దారుణం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో(Gachibowli) ఉన్న రెడ్‌స్టోన్‌ హోటల్‌లో(redstone hotel) దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్‌ విద్యార్థిని(Nusring student) అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. రెడ్‌స్టోన్‌ హోటల్‌లోని ఓ గదిలో ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. ఆగమేఘాల మీద క్లూస్‌ టీం, ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. గదిలో అంతా రక్తపు మరకలు ఉన్నాయి. గదిలో మద్యం బాటిల్స్‌ పడి ఉన్నాయి. చనిపోయింది నర్సింగ్‌ విద్యార్థిని శ్రుతిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు హోటల్ దగ్గర ఆందోళనకు దిగారు. తమ బిడ్డపై అత్యాచారానికి పాల్పడి తర్వాత ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.

Eha Tv

Eha Tv

Next Story