Telangana : నేడు క‌రీంనగర్‌కు న‌లుగురు మంత్రులు

క‌రీంనగర్ జిల్లాలో నేడు.మంత్రులు పర్యటించ‌నున్నారు.

By :  Eha Tv
Update: 2024-07-19 03:13 GMT

క‌రీంనగర్ జిల్లాలో నేడు.మంత్రులు పర్యటించ‌నున్నారు. ఈరోజు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించ‌నున్నారు. ఉదయం 07:00 గంటలకు హైదరాబాదు నుండి పెద్దపల్లి జిల్లా కోలనూరుకు బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు పెద్దపల్లి జిల్లాల ఓదెల మండలం కొలనూరులో అయిల్ ఫాం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు రైతులతో ఇంటిరాక్షన్ లో పాల్గొంటారు.

12:10 గంట‌ల‌కు కరీంనగర్ లో మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు జయంతి సందర్భంగా ఆయ‌న‌ విగ్రహానికి మంత్రులు నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1:00 గంటలకు కరీంనగర్ లోని వి - కన్వెన్షన్ లో రైతు భరోసా పై రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తారు. సాయంత్రం 5:00 గంటలకు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. 

Tags:    

Similar News