Chandrababu : తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తా

తెలంగాణలో మరోసారి టీడీపీని పటిష్టం చేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతూ ఉన్నారు.

Update: 2024-08-10 15:11 GMT

తెలంగాణలో మరోసారి టీడీపీని పటిష్టం చేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతూ ఉన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వాల పెంపుపై చంద్రబాబు చర్చించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం అంశంపైనా ఈ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని.. త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తానని హామీ ఇచ్చారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంపై కార్యకర్తలకు, టీడీపీ నేతలకు చంద్రబాబు నాయిడు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లోని క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకెళ్లాలని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 15-20 రోజుల్లో సభ్యత్వాల నమోదు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేకపోయిందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని అన్నారు.

Tags:    

Similar News