Cricket : నేడు శ్రీలంకతో టీ-20 సిరీస్‌కు కెప్టెన్‌ని ప్రకటించే అవ‌కాశం.. హార్దిక్‌కు షాక్ ఇస్తారా.?

శ్రీలంక టీ-20 సిరీస్ కు భారత జట్టు కెప్టెన్‌ను గురువారం ప్రకటించే అవ‌కాశం ఉంది.

By :  Eha Tv
Update: 2024-07-18 04:11 GMT

శ్రీలంక టీ-20 సిరీస్ కు భారత జట్టు కెప్టెన్‌ను గురువారం ప్రకటించే అవ‌కాశం ఉంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ల మధ్య బుధవారం సమావేశం జరగాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. గురువారం జరిగే సమావేశంలో కెప్టెన్‌తో పాటు జట్టు ఎంపికపై చర్చ జరగనుంది.. ఇందులో కొత్త సెలెక్టర్ అజయ్ రాత్ర కూడా పాల్గొననున్నారు.

అంతకుముందు కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో చర్చించారు. జులై 27 నుంచి శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. టీ-20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను టీ-20 కెప్టెన్‌గా చేసే అవకాశం ఉందని గతంలో చర్చ జరిగింది.. అయితే హార్దిక్ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతుండ‌టం వ‌ల్ల‌ సూర్యకుమార్ పేరు చర్చలోకి వచ్చింది. ఈ నేప‌థ్యంలోనే అగార్కర్. గంభీర్ ఈ ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమాన్‌ను 2026 T20 ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా చేయాలని కోరుకుంటున్నట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో టీ-20 జట్టుకు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. గంభీర్ కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. సూర్యకుమార్‌ను ఆ జట్టులోకి తీసుకున్నాడు.

Tags:    

Similar News