Team India : కొత్త కోచ్‌, కెప్టెన్‌ల‌తో శ్రీలంక చేరుకున్న టీమిండియా

మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంక చేరుకుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా సోమవారం ముంబై నుంచి శ్రీలంకకు బయలుదేరింది.

By :  Eha Tv
Update: 2024-07-23 03:53 GMT

మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంక చేరుకుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా సోమవారం ముంబై నుంచి శ్రీలంకకు బయలుదేరింది. ప్ర‌స్తుతం జట్టు అక్కడికి చేరుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సమాచారం ఇచ్చింది. జట్టుకు సంబంధించిన ప్రత్యేక వీడియోను బోర్డు షేర్ చేసింది. ఇందులో భారత ఆటగాళ్లు సరదాగా ఉన్నారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కనిపించాడు. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు ఇతర ఆటగాళ్లు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి బస్సు ఎక్కుతున్న దృశ్యాలు వీడియోలో క‌నిపిస్తాయి. ప్లేయర్లు బస్సులో కూడా చిల్ మోడ్‌లో కనిపిస్తారు.

ఈ పర్యటనలో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు వ 3 వ‌న్డేల‌ సిరీస్‌ను ఆడనుంది. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ 28న, మూడో మ్యాచ్ జూలై 30న జరగనుంది. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ ఆగస్టు 4న, మూడో మ్యాచ్ ఆగస్టు 7న జరగనుంది. వన్డే సిరీస్‌ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ఆడనుంది.

Tags:    

Similar News