Rishabh Pant : రిషబ్ పంత్ సంచలన ప్రకటన.. నీరజ్ చోప్రా స్వ‌ర్ణం గెలిస్తే..

భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మంగళవారం పారిస్ ఒలింపిక్స్‌లో తన ఈవెంట్‌ను ఘ‌నంగా ప్రారంభించాడు.

Update: 2024-08-07 03:49 GMT

భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మంగళవారం పారిస్ ఒలింపిక్స్‌లో తన ఈవెంట్‌ను ఘ‌నంగా ప్రారంభించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా 89.34 మీటర్లు జావెలిన్ విసిరి ఫైనల్‌కు చేరాడు. ఈ సీజన్‌లో అతని అత్యుత్తమ త్రో ఇదే. దీనిపై భారత క్రికెట్‌ జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిష‌బ్ పంత్‌ ఓ పెద్ద ప్రకటన చేశాడు.

భారత జట్టు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సంచలన ప్రకటన చేశాడు. ఫైనల్‌లో నీరజ్ చోప్రా భారత్‌కు బంగారు పతకాన్ని గెలిస్తే.. ఓ ల‌క్కీ అభిమానికి 1,00,089 రూపాయల మొత్తాన్ని బహుమతిగా ఇస్తానని ప్ర‌క‌టించాడు. అలాగే 10 విమానం టికెట్లు ఇస్తానని ట్వీట్‌లో రాశాడు.

మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన నీరజ్.. నాతో ఎప్పటికీ ఈ చొరవ ఉంటుంది. రాబోయే తరానికి స్ఫూర్తి లభిస్తుంది.. నాకు ఇంతకంటే పెద్ద గోల్‌ ఏమీ లేదని భావిస్తున్నాను. నీరజ్ చేయగలిగితే.. మనం కూడా చేయగలం అని నమ్ముతారు. ఎందుకంటే నేను కూడా ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చాను. నేను పారిస్‌కు వచ్చిన పని పూర్తిచేస్తానని వ్యాఖ్యానించాడు.

Tags:    

Similar News