Cricket : 'రోహిత్ రాత్రి 2.30కు గదికి పిలిచాడు'.. షాకింగ్ విష‌యం చెప్పిన క్రికెట‌ర్‌

భారత వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా రోహిత్ శర్మ గురించి షాకింగ్ విష‌యం రివీల్ చేశాడు.

Update: 2024-09-13 03:42 GMT

భారత వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా రోహిత్ శర్మ గురించి షాకింగ్ విష‌యం రివీల్ చేశాడు. రాత్రి 2:30 గంటలకు రోహిత్ తనను అత‌డి గదికి పిలిచాడ‌ని పీయూష్ చావ్లా చెప్పాడు. శుభంకర్ మిశ్రాతో పాడ్‌కాస్ట్‌లో చావ్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పీయూష్ చావ్లా రోహిత్ కెప్టెన్సీ నాణ్య‌త గురించి మాట్లాడాడు.

పియూష్ చావ్లా మాట్లాడుతూ.. రోహిత్‌ను మంచి కెప్టెన్‌గా అభివర్ణించాడు. రోహిత్ కెప్టెన్సీలో పీయూష్ చావ్లా ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. భారత్ తరఫున కూడా చావ్లా చాలా మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం చావ్లా యూపీ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు.

చావ్లా మాట్లాడుతూ.. నేను రోహిత్‌తో చాలా క్రికెట్ ఆడాను. కాబట్టి అతడితో నాకు మంచి అనుబంధం ఉంది. ఒకసారి రాత్రి 2.30 గంటలకు నాకు మెసేజ్ చేసి.. నీవు మేల్కొని ఉన్నారా? లేదంటే రూమ్‌కు ర‌మ్మ‌ని పిలిచాడు. అక్క‌డికి వెళ్లిన‌ తర్వాత రోహిత్‌ కాగితంపై ఫీల్డ్ సెట్ చేసి వార్నర్‌ను అవుట్ చేయడం గురించి నాతో చర్చించాడు. ఆ సమయంలో కూడా రోహిత్‌ నా నుండి బెస్ట్‌ ఎలా పొందాల‌నే విష‌య‌మై ఆలోచిస్తున్నాడు. రోహిత్‌ కెప్టెన్ కాదు నాయకుడు. 2023 ODI ప్రపంచ కప్, 2024 T20 ప్రపంచ కప్ అయినా.. అతడు బ్యాటింగ్ చేసిన విధానం.. తదుపరి బ్యాట్స్‌మెన్‌కు సులభంగా ఉండే విధంగా అతడు మ్యాచ్ టోన్‌ను సెట్ చేశాడు. రోహిత్‌ నిజమైన నాయకుడు. అంద‌రికీ పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని పొగిడాడు.

Tags:    

Similar News