IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది

Update: 2024-09-22 07:35 GMT

బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు 280 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో సెప్టెంబర్ 27 నుంచి ఇరు జట్ల మధ్య రెండో చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.

తొలి టెస్టు మ్యాచ్‌కు ప్రకటించిన టీమ్‌నే ఈ టెస్టు మ్యాచ్‌కు కూడా భారత్ రిటైన్ చేసుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టు నుంచి విశ్రాంతి తీసుకోవచ్చని భావించారు.. అయితే సెలెక్టర్లు అతనిని కూడా జట్టులోకి తీసుకున్నారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా చెన్నై టెస్టు ఆడింది. గ‌త‌ మ్యాచ్‌లో యశ్ దయాల్‌కు ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు. కాన్పూర్ టెస్టు కోసం జట్టు పదకొండు మందిలో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అదే జట్టుతో ఆడుతుందా అనేది చూడాలి.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, , జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.

Tags:    

Similar News