Bypoll 2024 : నేడు 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌.. ఉపఎన్నికలు ఎక్క‌డంటే..

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

By :  Eha Tv
Update: 2024-07-10 02:43 GMT

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అత్యధికంగా నాలుగు సీట్లు పశ్చిమ బెంగాల్‌, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్‌తో సహా పలువురు అనుభవజ్ఞులు, కొన్ని కొత్త ముఖాలు ఈ ఉప‌ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

జూన్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 21 నాటికి అభ్యర్థులందరూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జూన్ 24న నామినేషన్ల పరిశీలన జరగగా, నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 26 చివరి తేదీ. ఉప ఎన్నికకు జూలై 10న ఓటింగ్, జూలై 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. జూలై 15లోపు ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది.

బీహార్‌లోని రుపౌలీ, పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మానిక్తలా, తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడ, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూరు, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, హమీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

ఉప ఎన్నికలకు ఓటింగ్ జరుగుతున్న స్థానాల్లో గతసారి బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా మూడు స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో గెలిచింది. టీఎంసీ, బీఎస్పీ, జేడీయూ, ఆప్‌, డీఎంకేలకు చెందిన ఒక్కో అభ్యర్థి విజయం సాధించారు. ఇప్పుడు ఆయా స్థానాల‌ను పార్టీలు నిల‌బెట్టుకోనున్నాయా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News