ఈటీవీలో ప్రసారమవుతున్న 'పాడుతా తీయగా' షో ఎంత పాపులరయిందో తెల్సిందే.

ఈటీవీలో ప్రసారమవుతున్న 'పాడుతా తీయగా' షో ఎంత పాపులరయిందో తెల్సిందే. ఆనాటి అద్భుత గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) ఆధ్వర్యంలో నడిచిన ఈ పాటల కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు అనతికాలంలోనే చాలా దగ్గరైంది. ఈ కార్యక్రమం ద్వారా వందలాది మంది గాయనీగాయకులు ప్రపంచానికి పరిచయం అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం మరణం తర్వాత ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ ఈ షోను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సిరీస్ జరుగుతుండగా.. కీరవాణి, చంద్రబోస్, సునీత జడ్జిపైగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ జడ్జిలపై తాజాగా సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

సూపర్ సింగర్ సహా పలు షోలలో విజేతగా నిలిచిన ప్రవస్తి.. 'పాడుతా తీయగా(Padutha Theeyaga)' సిల్వర్ జూబ్లీ సిరీస్ లో పాల్గొంది. అయితే ఆమె కొద్దికాలం తర్వాత ఈ షో నుంచి ఎలిమినేట్ అయింది. ఇక ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రవస్తి.. షోపైనా, జడ్జిలపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. "పాడుతా తీయగా కి వెళ్లాలనుకునే సింగర్స్‌కి నా సలహా ఒక్కటే. ఏమైనా రికమండేషన్స్ లేదా జడ్జిల నుంచి రిఫరెన్స్‌లు ఉంటే మాత్రమే వెళ్ళండి. అవి లేకుండా వెళ్తే మీకు అన్యాయం, మానసిక వేధింపులు మాత్రమే ఎదురవుతాయి." అని ప్రవస్తి ఆరోపించింది. "జడ్జిలు నన్ను చీడపురుగుల్లాగా చూసేవారు. నా బాడీ మీద జోకులు వేసేవారు. ఇవన్నీ నాకు వారి దగ్గరలో కూర్చున్న ఆడియన్స్ ద్వారా తెలిశాయి. ఇంత పేరున్న జడ్జెస్ నుంచి నేను ఇలాంటివి అసలు ఊహించలేదు. షో మేనేజ్మెంట్ కూడా కంటెస్టెంట్స్ డ్రెస్సింగ్ ఎక్స్ పోజింగ్ చేసేలా ఉండాలి అన్నట్టుగా మాట్లాడేవారు. బొడ్డు కనిపించేలా చీర కట్టాలి అనేలా వారి మాటలు మాట్లాడేవారని ఆమె ఆరోపించింది. ఒక షోలో తనకు ఇలాంటి అనుభవాలు ఎదురుకావడం ఇదే తొలి అని ప్రవస్తి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ehatv

ehatv

Next Story