Hyderabad : రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మృతి

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పురానాపూల్‌ బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొనడంతో తండ్రీకూతుళ్లు మృతి చెందారు

Update: 2024-08-22 03:05 GMT

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పురానాపూల్‌ బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొనడంతో తండ్రీకూతుళ్లు మృతి చెందారు. జియాగూడలో నివాసముంటున్న బాబు మియా (55) అనే వ్యక్తి మధ్యాహ్నం పాతబస్తీకి వెళ్లి తన కుమార్తె నౌషీన్ ఫాతిమా (19)ని హుస్సేనియాలం మహిళా కళాశాల నుంచి తీసుకెళ్తున్నాడు.

తండ్రీకూతుళ్లు ఇంటికి బ‌య‌లుదేరి పురానాపూల్ వద్దకు చేరుకోగానే డీసీఎం వ్యాన్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. నౌషీన్, బాబు మియా ఇద్ద‌రూ రోడ్డుపై పడిపోయారు. ప్ర‌మాదంలో నౌషీన్ అక్కడికక్కడే మృతి చెందగా.. బాబు మియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలంలో భారీగా జనం గుమిగూడారు. స‌మాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన‌ పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News