Hyderabad : దొంగతనానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు..!

దొంగతనానికి వెళ్లి ఓ దొంగ ప్రాణాలు కోల్పోయాడు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది

Update: 2024-08-27 03:02 GMT

దొంగతనానికి వెళ్లి ఓ దొంగ ప్రాణాలు కోల్పోయాడు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నాదర్గుల్ కుర్మలగూడలో ఓ ఇంట్లో చోరికి ముగ్గురు దొంగలు వెళ్లారు. ముగ్గురు దొంగలు ఆటో తీసుకొని దొంగతనానికి పోయారు. వారి వెంట వెల్డింగ్‌ మిషన్ కూడా తీసుకుని వెళ్లారు. అయితే.. స్థానికులు ముగ్గురిని అనుమానిత వ్యక్తులుగా గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేష‌న్‌కు వెళుతుండగా సడన్‌గా హాజీ అనే దొంగ‌కు చాతి నొప్పి వ‌చ్చింది. దీంతో మార్గమధ్యం నుండే పోలీసులు అత‌డిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. హాస్పిటల్లో చికిత్స పొండుతూ హాజీ మృతి చెందాడు. హాజీకి 20 రోజుల క్రితం గుండె చికిత్స చేయించుకున్న‌ట్లు పోలీసులు విచార‌ణ‌లో తేలింది. హాజీ వృత్తి కొబ్బరి బొండాల వ్యాపారం కాగా.. ప్రవృత్తి దొంగతనాలు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News