అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహానికి హైదరాబాద్ నుండి హాజరైంది వీరే..!

శుక్ర‌వారం అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌లు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు

By :  Eha Tv
Update: 2024-07-13 00:50 GMT

శుక్ర‌వారం అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌లు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు హాజ‌ర‌య్యారు. అతిథి జాబితాలో కిమ్, ఖోలే కర్దాషియాన్, అడెలె, లానా డెల్ రే, డ్రేక్, డేవిడ్ బెక్‌హామ్‌తో పాటు అతని భార్య విక్టోరియా బెక్‌హాం ​​వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ఉన్నారు. పలువురు మాజీ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి చాలా మంది నటులు, నటీమణులు హాజ‌ర‌వ‌గా.. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా వెళ్లారు.

ఈ వివాహానికి బ‌య‌లుదేరిన రామ్ చరణ్-ఉపాసన బేగంపేట విమానాశ్రయానికి కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్‌లో వచ్చారు. వివాహ‌వేడుక‌కై ముంబైకి బ‌య‌లుదేరిన‌ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంప‌తులు.. వారి కుమార్తె సితారతో కలిసి విమానాశ్రయంలో కనిపించారు.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకకు హాజ‌రైన‌ అతిథులలో చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలు ఉన్నారు. ఈ వేడుకలో ప్రఖ్యాత నటీమణులు రష్మిక మందన్న, సమంత, నయనతార కూడా కనిపించనున్నారు. పలువురు ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, ఆమె సోదరి అనమ్ మీర్జా కూడా హాజరవ‌నున్నారు.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ తమ వివాహ వేడుకలను మార్చిలో జామ్‌నగర్‌లో విలాసవంతమైన కార్యక్రమంతో ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ జంట 1200 మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ వేడుక‌కు ఇంట‌ర్నేష‌న‌ల్‌ స్టార్ రిహన్నా, ప్రముఖ కళాకారులు దిల్జిత్ దోసాంజ్, అరిజిత్ సింగ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఇటీవల అనంత్-రాధిక తమ హల్దీ, మెహందీ వేడుకలను జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన‌ ఫోటోలు-వీడియోలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైర‌ల్ అయ్యాయి.

Tags:    

Similar News