ప్రధానమంత్రి నరేంద్రమోదీకి(Narendra Modi) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) లేఖ(Letter) రాశారు.

రాజకీయ స్వార్థంతో నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రతిష్టను దిగజార్చారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి(Narendra Modi) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) లేఖ(Letter) రాశారు. 'స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారు. టీటీడీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి' అని లేఖలో జగన్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లడ్డూ వివాదంలో నిజాలు ప్రపంచానికి తెలియాలి. వాస్తవాలు నిగ్గు తేల్చాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు.

Eha Tv

Eha Tv

Next Story